Nitish Kumar | బీహార్లో రాజకీయ పరిమాణాలు వేగంగా మారుతున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ శాసనసభాపక్ష నేతగా జేడీయూ నేత నితీశ్కుమార్ ఎన్నికయ్యారు. వెంటనే ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్తో కలిసి నితీశ్కుమార్ గవర్నర్ ఫాగు చౌహాన్కు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరనున్నారు. ఇప్పటికే పాట్నాలోని రబ్రీదేవి నివాసంలో జరిగిన మహాఘట్బంధన్ సమావేశంలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల ఎమ్మెల్యేలు నితీశ్కు మద్దతు తెలుపుతూ రాసిన లేఖపై సంతకాలు చేశారు. ఈ లేఖను గవర్నర్కు ఆర్జేడీ అందజేసింది.
అంతకుముందు జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో నితీశ్ కుమార్ సమావేశమై పరిస్థితిని వివరించారు. బీజేపీతో కలిసి ముందుకు సాగలేమని చెప్పారు. దీంతో ఎన్డీఏ నుంచి బయటకు రావాలన్న నిర్ణయానికి జేడీయూ నేతలు ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తున్నది. ఆ వెంటనే గవర్నర్ను కలిసి బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. రాజ్భవన్ నుంచి నేరుగా రబ్రీదేవి నివాసానికి చేరుకుని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తదితరులతో నితీశ్ కుమార్ సమావేశమయ్యారు.