Nitish Kumar | బీహార్ సీఎంగా రాజీనామా చేసిన నితీశ్కుమార్.. తిరిగి నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అయ్యారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్ ఫాగు చౌదరిని కలిసి నితీశ్ను కోరిన సంగతి తెలిసిందే. తేజస్వి యాదవ్, నితీశ్ కుమార్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం నితీశ్ సీఎంగా, తేజస్వి డిప్యూటీ సీఎంగా ఉంటారని సమాచారం. మంత్రుల నియామకాలన్నీ నితీశ్కుమార్కు విశేషాధికారాలు కల్పించారు. స్పీకర్గా ఆర్జేడీ నేతను ఎన్నుకుంటారని వినికిడి.
అయితే గవర్నర్ చర్యను బట్టే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. గవర్నర్తో నితీశ్ భేటీలో తేజస్వి యాదవ్ కూడా పాల్గొన్నారు. లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కూడా నితీశ్ సారధ్యంలోని నూతన ప్రభుత్వంలో భాగస్వాములవుతాయి. మంగళవారం ఉదయం జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీలో బీజేపీతో పొత్తు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. జనతాదళ్ (యునైటెడ్)లో చీలిక కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నదని నితీశ్ ఆరోపించారు. మరోవైపు, రబ్రీదేవి నివాసంలో జరిగిన భేటీలో నితీశ్కుమార్తో తేజస్వి యాదవ్ జత కట్టేందుకు ఆర్జేడీ ఎమ్మెల్యేలు అంగీకరించారు.
2014 ఎన్నికల తర్వాత తొలిసారి బీజేపీతో పొత్తు నుంచి బయటకు వచ్చి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి నితీశ్ సర్కార్ ఏర్పాటు చేశారు. 2015 ఎన్నికల్లో మహాఘట్బంధన్ తరఫున విజయం సాధించారు. తేజస్వి యాదవ్ తదితరులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్.. 2017లో తేజస్వి అవినీతి పరుడంటూ మహఘట్బంధన్కు రాం రాం చెప్పి, బీజేపీతో కలిసి సర్కార్ ఏర్పాటు చేశారు.