హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): నీతి ఆయోగ్ నిరర్థకంగా మారిపోయిందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలోనూ దీనిపై విపరీతమైన చర్చ నడుస్తున్న నేపథ్యంలో మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం పాప్ క్విజ్ అంటూ ఓ ట్వీట్ చేశారు.
‘కొన్ని సంవత్సరాల క్రితం చాలా ఆడంబరంగా ఒక సలహా సంఘం ఏర్పడింది. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన క్యాబినెట్.. ఆ సంస్థ సలహాలను పట్టించుకోలేదు. పూర్తిగా ధిక్కరించి, నిర్లక్ష్యం చేశారు. ఆ సంస్థ పేరు ఏంటో మీరు చెప్పగలరా..? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నీతిఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్ నేను లైఫ్లైన్ ఆప్షన్ తీసుకోవాలనుకొంటున్నా అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ జవాబిచ్చారు. నెటిజన్లు అంతా నీతి ఆయోగ్ అని సమాధానాలు చెప్పారు.