ఢిల్లీ ,జూన్ 22: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐవోఎస్) యోగా లో డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టింది. ఈ డిప్లొమా కోర్సును కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే ప్రారంభించారు. కోర్సుకు సంబంధించిన సెల్ఫ్ ట్రైనింగ్ మెటీరియల్ను విడుదల చేశారు. విద్యార్థులకు ఈ విధమైన వృత్తిపర కోర్సులు అందిస్తున్నందుకు ఎన్ఐవోఎస్ను మంత్రి అభినందించారు.
కొవిడ్ సమయంలో యోగా కారణంగా ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయని అన్నారు. యోగా శాస్త్రం నేర్చుకుని ఉత్తీర్ణులైనవారు ఉద్యోగార్ధులుగా కాక, ఉద్యోగ ప్రదాతలుగా మారడానికి ఈ కోర్సు సాయపడతుందని ధోత్రే చెప్పారు.రెండేళ్ల ఈ డిప్లొమా కోర్సులో, మొదటి సంవత్సరంలో, యోగా నేర్పడానికి సంబంధించి ఐదు అంశాల్లో శిక్షణ ఉంటుందని ఎన్ఐవోఎస్ చైర్పర్సన్ వెల్లడించారు. రెండో సంవత్సరంలో, యోగా చికిత్సకు సంబంధించి ఐదు అంశాలను బోధిస్తారని వివరించారు.