అహ్మదాబాద్, అక్టోబర్ 18:జాతిపిత మహాత్మాగాంధీ స్థాపించిన గుజరాత్ విద్యాపీఠ్ చాన్స్లర్గా గవర్నర్ దేవ్వ్రత్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ 9 మంది ట్రస్టీలు రాజీనామా చేశారు. అయితే వర్సిటీ అత్యున్నత నిర్ణాయక మండలి వీరి రాజీనామాలను ఆమోదించలేదు. ప్రజాస్వామ్య విలువలు, వర్సిటీ స్వయం నిర్ణయాధికారాన్ని నిలబెట్టేందుకు చాన్స్లర్ పదవిని నిరాకరించాలని గవర్నర్కు 9 మంది ట్రస్టీలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రాజకీయ ఒత్తిడితోనే చాన్స్లర్గా దేవవ్రత్ను నియమించారని, ఇది గాంధీజీ విలువలకు, విధానాలకు పూర్తిగా విరుద్ధమని అందులో విమర్శించారు. అనారోగ్య కారణాలతో గాంధేయవాది ఇలా భట్ (89) రాజీనామా చేయడంతో కొత్త చాన్స్లర్గా దేవవ్రత్ను నియమించారు. 1920లో గాంధీజీ ఈ వర్సిటీని స్థాపించారు.