న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పర్వత ప్రాంతాల నుంచి మైదానాల వరకు వర్షాలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలకు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో తొమ్మిది మృత్యువాతపడ్డారు. ఢిల్లీలో అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. రాజస్థాన్కు రెడ్అ లర్ట్, మధ్యప్రదేశ్లో ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. రాబోయే మూడు రోజులు ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.
ఢిల్లీలో యమునా నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. మరో వైపు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. శనివారం పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాలు జలమయమ్యే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. యమునా తీర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను తరలించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. మధ్యప్రదేశ్లో దాదాపు సగరం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
ఆగస్ట్ 4వ తేదీ వరకు తూర్పు రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అవకాశం ఉంది. గత 24 గంటల్లో రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాపాతం నమోదైంది. కరౌలి, భరత్పూర్, ధోల్పూర్, దౌసా, అల్వార్, చురు, హనుమాన్గఢ్ జిల్లాల్లో భారీ వర్షపాతం రికార్డయింది. భారీ వర్షాల కారణంగా హిమాచల్ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆయా ప్రాంతాల్లో సుమారు 200 మంది చిక్కుకుపోయారు. నదీ పరిసర ప్రాంతాలకు వెళ్లొద్దని షిమ్లా వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
మరో వైపు ఆగస్ట్ 3 వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షాల కారణంగా యూపీ ముజఫర్నగర్ జిల్లాలో వర్షాలకు ఇంటిపైకప్పు కూలగా.. ముగ్గురు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్లో వర్షానికి సంబంధించిన ఘటనల్లో ఆరుగురు మృత్యువాతపడ్డారు.