గోపాల్గంజ్: బీహార్లోని గోపాల్గంజ్లో జరిగిన నాటు సారా విషాదం కేసులో తొమ్మిది మందికి ఇవాళ మరణశిక్షను విధించారు. ఆ కేసులో మరో నలుగురు మహిళా నిందితులకు యావజ్జీవ శిక్షను ఖరారు చేశారు. 2016లో జరిగిన ఆ ఘటనలో 21 మంది మరణించిన విషయం తెలిసిందే. జీవితకాల శిక్ష పడిన మహిళలకు పది లక్షల జరిమానా విధించారు. స్పెషల్ ఎక్సైజ్ కోర్టు ఈ కేసులో తీర్పునిచ్చింది. ఫిబ్రవరి 26వ తేదీ ఇచ్చిన తీర్పులో 13 మందిని దోషులుగా తేల్చారు. ఇవాళ మరణశిక్ష పడిన 9 మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావడం విశేషం. 206 ఆగస్టులో గోపాల్గంజ్ జిల్లాలోని ఖర్జుర్బానీ ప్రాంతంలో నాటు సారా తాగిన ఘటనలో 21 మంది మరణించారు. కొందరు కంటి చూపు కోల్పోయారు. ఇదే కేసులో పోలీసులపై చర్యలు తీసుకున్నారు. 21 మంది పోలీసుల్ని డిస్మిస్ చేశారు. దాంట్లో ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు కూడా ఉన్నారు.