హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కోర్సుల్లో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ప్రవేశాలు కల్పిస్తున్నది. ఆసక్తి కలిగినవారు ఆగస్టు 4లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. న్యూరో టెక్నాలజీ, డయాలసిస్, కార్డియోవాస్కులర్, ఎమర్జెన్సీ అండ్ ట్రామాకేర్, రేడియో థెరఫీ, మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ, అనస్థీషియా, పెర్ఫ్యూజన్ టెక్నాలజీ, రేడియేషన్ థెరఫీ, రెసిపిరేటరీ థెరఫి అండ్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ వంటి కోర్సులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ మార్కుల ప్రాతిపదికన సీట్లు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. వివరాలకు నిమ్స్ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని తెలిపారు.