కన్నడ హీరోయిన్ సంజనా గల్రానీ చెల్లెలు నిక్కి గల్రానీ తెలుగులో మూడునాలుగు సినిమాలు చేసి సైడ్ అయిపోయిపోయింది. మీడియాకి దూరంగా ఉండే ఈ అమ్మడు ఇప్పుడు సడెన్ గా వార్తల్లో నిలిచింది. అందుకు కారణం అమ్మడు మోసపోవడమే. 50లక్షలు తీసుకొని 5ఏళ్లుగా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడంటూ నిఖిల్ అనే హోటల్ యజమానిపై కేసు పెట్టింది.
అమృతహళ్లి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం నిక్కీ గల్రానీ 2016లో నిఖిల్ అనే వ్యక్తికి రూ. 50లక్షలు ఇచ్చింది. ఫలితంగా నెలకు లక్షరూపాయలు ఇస్తానని నిఖిల్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే డబ్బులు తీసుకున్నాక మాట తప్పాడని, ఇప్పటివరకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని అమ్మడు ఫిర్యాదులో తెలిపింది. ఎప్పుడు అడిగినా సరైన సమాధానం ఇవ్వకుండా నిఖిల్ తప్పించుకుంటున్నాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.