ముంబై : రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూను విధించారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ ఉండదని.. ప్రజలకు ముందుస్తుగా సమాచారం ఇస్తామని చెప్పారు. ‘నేను లాక్డౌన్ విధించడానికి ఇష్టపడను.. కానీ కరోనా బాధితులు పెరుగుతుండడంతో ఆరోగ్య సంరక్షణా సౌకర్యాలు తగ్గిపోయే అవకాశం ఉంది’ అని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు భద్రతా నియమాలు పాటించకుంటే కఠినమైన లాక్డౌన్ తప్పదని హెచ్చరించారు.
హాస్పిటళ్లలో తగిన పడకలు, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రలో శుక్రవారం 36,902 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 112 మంది ప్రారంభించారు. రాష్ట్రంలో ఐదు రోజుల్లో 1.3 లక్షలకుపైగా కేసులు రికార్డయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేబినెట్ సమావేశం అనంతరం బీడ్, నాందేడ్ జిల్లాల్లో పది రోజుల లాక్డౌన్ విధించారు. రాష్ట్రవ్యాప్త లాక్డౌన్కు బదులుగా స్థానిక పరిస్థితుల మేరకు లాక్డౌన్ విధింపునకు జిల్లా అధికారులకు లాక్డౌన్ విధించేందుకు అనుమతి ఇచ్చినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.