శ్రీశైలం : శ్రీశైలం డ్యామ్ సమీపంలో వచ్చిన భూకంపంపై ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త నగేశ్ వివరణ ఇచ్చారు. సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో శ్రీశైలం డ్యామ్ దిగువన నల్లమలలో భూకంపం సంభవించిందని తెలిపారు. ప్రాజెక్టు వద్ద ఉన్న భూపంక కేంద్రాల్లో తీవ్రత 3.7గా నమోదైందని చెప్పారు. శ్రీశైలానికి 35 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఏడు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. భూకంపానికి గల కారణాలపై అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాతిపొరల్లోని ఒత్తిడి కారణంగానే ప్రకంపనలు వచ్చి ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు.