న్యూఢిల్లీ: ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థల్లో ఒకటైన బజాజ్ ఆటోమొబైల్స్.. తన కస్టమర్ల కోసం ‘పల్సర్’ శ్రేణిలో సరికొత్త మోడల్మోటారు సైకిల్ను విడుదల చేయనున్నది. ‘నెక్ట్స్ జనరేషన్ పల్సర్-250సీసీ అనే పేరుతో ఈ బైక్ మార్కెట్లోకి రానున్నది.
ఇందులో ప్రధానంగా సౌకర్యవంతమైన సీటింగ్తో ఉండే బైక్ డిజైన్.. వాహన ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుందని సంస్థ తెలిపింది. ఎన్ఎస్/ ఆర్ఎస్ అనే రెండు మోడల్స్లో పల్సర్ 220సీసీ రానున్నట్లు తెలుస్తున్నది.
ఈ బైక్లో సరికొత్త ఎల్ఈడీ హెడ్ల్యాంప్, బాడీ ప్యానెల్స్తో కూడిన ఇంధన ట్యాంక్, టాప్-అప్ పిలీయన్(వెనక) సీటు, కొత్త ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్, కనెక్టివిటీ టెక్నాలజీ, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్ తదితర ఫీచర్లు జత కలిశాయి.
ఇలాంటి అత్యాధునిక హంగులతో రానున్న బజాజ్ ‘నెక్ట్స్ జనరేషన్ పల్సర్ బైక్ ధర.. రూ.1.20 లక్షలపైనే ఉండొచ్చునని అంచనా. ఇంతకుముందు మోడల్ బైక్ల కంటే చౌకగా, తేలిగ్గా దీన్ని కొనుగోలు చేయొచ్చు.
ఎప్పుడు ఈ బైక్ మార్కెట్లోకి వస్తుందన్న సంగతి వెల్లడించకున్నా.. ఈ ఏడాది పండుగ సీజన్లో అంటే దీపావళి నాటికి ఈ మోటారు బైక్ను బజాజ్ ఆటోమొబైల్స్ విడుదల చేయనున్నట్లు తెలిసింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ముంబైలో ఇల్లు కొన్న డీమార్ట్ యజమాని.. ఇంటి ధర ఎంతంటే..?
డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతే ఈ అలారం మోగుతుంది.. సిద్ధం చేసిన మిలటరీ
ఈ పరిస్థితుల్లో ఇండియా నుంచి దిగుమతులు చేసుకోలేం: ఇమ్రాన్ఖాన్
లైవ్లో రిపోర్టర్ మైక్రోఫోన్ ఎత్తుకెళ్లిన కుక్క
లాక్డౌన్ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
షోఫియాన్లో ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం
ఆర్మీ బలోపేతం వెనుక జనరల్ మానెక్షా అవిరళ కృషి.. చరిత్రలో ఈరోజు
రంగ్ దే 8 డేస్ కలెక్షన్స్ .. లక్ష్యానికి చాలా దూరంలో నితిన్