రెండో టెస్టులో బంగ్లా చిత్తు
క్రైస్ట్చర్చ్: తొలి టెస్టులో ఎదురైన పరాజయానికి న్యూజిలాండ్ బదులు తీర్చుకుంది. బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 117 పరుగుల తేడాతో విజయం సాధించింది. కివీస్ 521/6 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్లో 126 పరుగులకు ఆలౌటైంది. మంగళవారం ఫాలోఆన్ ప్రారంభించిన బంగ్లా.. రెండో ఇన్నింగ్స్లో 278 పరుగులకు పరిమితమైంది. లిటన్ దాస్ (102) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది. ఫలితంగా రెండు మ్యాచ్ల సిరీస్ 1-1తో ‘డ్రా’గా ముగిసింది. కెరీర్లో చివరి టెస్టు ఆడిన రాస్ టేలర్ ఆఖరి బంతికి వికెట్ పడగొట్టి ఆటకు వీడ్కోలు పలకగా.. బంగ్లా బ్యాటర్ను దూషించిన కివీస్ పేసర్ కైల్ జెమీసన్కు జరిమానా పడింది. డబుల్ సెంచరీతో అదరగొట్టిన లాథమ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, కాన్వేకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’అవార్డులు దక్కాయి.