న్యూఢిల్లీ: వచ్చే 64 రోజుల్లో ఏకైక కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (ఏఐ)కి నూతన యాజమాన్యం ఖరారవుతుందని కేంద్ర పౌర విమానయానశాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు. వచ్చే మే నెలాఖరు నాటికి ఎయిర్ ఇండియా భవిష్యత్ యజమానిని ఖరారు చేయాలని నిర్ణయించామని చెప్పారు. తద్వారా పౌర విమానయాన రంగంలో అతిపెద్ద సంస్కరణ కానున్నది.
టైమ్స్ నెట్వర్క్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఎకనమిక్ కాంక్లేవ్లో శుక్రవారం మాట్లాడుతూ వచ్చే 64 రోజుల్లో ఫైనాన్సియల్ బిడ్స్ మూసివేయాలని గురువారం జరిగిన సమీక్షలో నిర్ణయించినట్లు తెలిపారు. ఎయిర్ ఇండియా ప్రస్తుత ప్రైవేటీకరణ ప్రక్రియ.. కరోనా మహమ్మారి వల్ల జాప్యమైంది.
ఫైనాన్సియల్ బిడ్ల దాఖలు ప్రక్రియ త్వరలో ప్రారంభం అవుతుందని హర్దీప్ సింగ్ పూరీ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపులోపు పూర్తవుతుందన్నారు. జూన్ నెలాఖరు తర్వాత భవిష్యత్ ఎయిరిండియా యజమానులు ఖరారవుతారని చెప్పారు. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ ముగిసే నాటికి ఎయిరిండియాను ఫైనాన్సియల్ బిడ్ గెలుచుకున్న వారికి అప్పగింత ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.
ఇంతకుముందు ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ 2018లో విఫలమైంది. అప్పట్లో ఎయిరిండియాలో 76 శాతం వాటాను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆ ప్రయోగం ఫెయిల్ కావడంతో.. తదుపరి కార్యాచరణలో భాగంగా తాజాగా 100 శాతం వాటాలను ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ప్రైవేటీకరణ ప్రక్రియలో నిబంధనలను సరళతరం చేసింది.
ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించడానికి దాఖలైన బిడ్లలో రెండింటిని ఎయిర్లైన్ కుదించింది. టాటా గ్రూప్తోపాటు మరో సంస్థ పోటీ పడుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎయిరిండియా రికార్డు స్థాయిలో రూ.10 వేల కోట్ల నష్టాల్లో ఉంది. సంస్థ రుణాలు రూ.23 వేల పై చిలుకు ఉన్నాయి. మరో రూ.30 వేల కోట్ల రుణాలను కేంద్రం వర్కింగ్ క్యాపిటల్గా మార్చింది.
మా వాదనే నిజమైంది.. సుప్రీం తీర్పుపై రతన్ టాటా!
ధరలకనుగుణంగా ముడి చమురు దిగుమతి పాలసీ: ధర్మేంద్ర ప్రధాన్
స్క్రాపేజీ పాలసీ అమలు కష్టమే.. మారుతి ఈడీ శ్రీవాత్సవ
రిలయన్స్-ఆరామ్కో డీల్ మరింత జాప్యం.. ఎందుకంటే!