మథుర, జూలై 28: ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులతో చేయించిన పని విమర్శలకు దారితీస్తున్నది. వర్షంతో జిల్లాలోని ఓ పాఠశాల కాంపౌండ్లో బుధవారం నీరు చేరింది. దీంతో బడిలోనికి వచ్చేందుకు టీచర్ విద్యార్థులతో కుర్చీలు తెప్పించి వరుసగా ఏర్పాటు చేయించారు.
అదే నీటిలోనే చిన్నారులు నిలబడి కుర్చీలను పట్టుకుంటే.. వాటిపై నడుచుకుంటూ ఇవతలకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవడం తో అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు.