న్యూఢిల్లీ, జూలై 22: తమదాకా వస్తే గానీ తత్వం బోధపడదని అంటారు. కేంద్రమంత్రి ఫగ్గన్సింగ్ కులస్తేకు అలాంటి అనుభవమే ఎదురైంది. గురువారం ఆయన మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా శివనీ వెళ్లారు. కారులో వెళ్తుంటే దారి పక్కన వేడివేడిగా కాల్చి అమ్ముతున్న మక్క కంకులు కనిపించాయి. వాటిని చూడగానే మంత్రికి నోరూరింది. కారాపి మూడు కాల్చిన కంకులకు నిమ్మరసం, ఉప్పు రాసి ఇవ్వమన్నారు. వాటిని అమ్మే పిల్లగాడు చక్కగా పేపర్లో చుట్టి మంత్రి చేతికిచ్చాడు. ఎంత అంటే అతడు రూ.45 అని చెప్పాడు.
మంత్రికి ఒక్కసారిగా అబ్బా అంత రేటా అన్నట్టు చూశారు. ఆ సంగతి బైయటపడనీయకుండా ఆ కుర్రాడితో ఏవో కబుర్లు చెప్పారు. బుడ్డోడి ‘బిజినెస్ లెక్కల’పై రిజిస్టరు ఉందా అని వాకబు చేశారు. తర్వాత ఆ అనుభవంపై మంత్రి ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. దీనిపై నెటిజనులు ఆయనను ఓ లెవెల్లో ఆడుకుంటున్నారు. సామాన్యులపై జీఎస్టీ అంటూ, మరోటి అంటూ వీరబాదుడు బాదుతున్నారు. చివరికి పాలు, పెరుగును కూడా వదలక పన్నులు గుంజుతున్నారు. మరి ఆ కాస్తా 15 రూపాయలకే ‘అబ్బో’ అన్నట్టు మొఖం పెట్టడం ఏందని సెటైర్లు వేస్తున్నారు. కొంపదీసి కంకుల మీదా జీఎస్టీ బాదరు కదా! అని ఆహాశ్చర్యపోతున్నారు.