75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు తమ దేశ భక్తిని పలు రకాలుగా చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ జాతీయ జెండాని అవమానించాడంటూ జోరుగా ప్రచారం నడుస్తుంది. అయితే ఆయన ఉద్దేశం పూర్వకంగా జాతీయ జెండాను అవమానించపోయిన చరణ్పై నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
వివరాలలోకి వెళితే రామ్ చరణ్ కొ్న్నేళ్లుగా హ్యాపీ మొబైల్స్ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థకు ప్రమోటర్ గా రామ్ చరణ్ తేజ కొంత రెమ్యునరేషన్ తీసుకుని బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆ సంస్థ చరణ్ ఫొటోతో ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చింది. ఇందులో చరణ్ జాతీయ జెండా ఎగర వేస్తున్నట్లుగా ఫోటో ఉంది.
జాతీయ జెండాలో అశోక చక్రం లేకపోవడంతో నెటిజన్స్.. సంస్థతో పాటు చరణ్పై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో స్పందించిన సంస్థ వ్యాపార ప్రకటనల కోసం జాతీయ జెండాను వాడటం అనేది నేరం. అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకునేటప్పుడు జాతీయ జెండాను పోలి ఉండేలా త్రివర్ణ పతాకాన్ని మాత్రమే వాడాలి. అందుకునే అశోక చక్రం లేకుండా ఉండే త్రివర్ణ పతాకాన్ని వాడామంటూ వివరణ ఇచ్చింది సదరు సంస్థ. దీంతో నెటిజన్స్కి ఓ క్లారిటీ వచ్చింది. 2002 జాతీయ జెండా చట్టం ప్రకారం ఇలా అశోక చక్రం లేకుండా జెండా ఉండడం అనేది తీవ్ర నేరమనే చెప్పాలి.