న్యూఢిల్లీ, మే 24: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) లాభాల్లో దూసుకుపోయింది. మార్చితో ముగిసిన మూడు నెలలకుగాను రూ.606 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని గడించింది. 2020-21 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.250 కోట్లతో పోలిస్తే రెండు రెట్ల కంటే అధికంగా నమోదైంది.
బ్యాంక్ ఆదాయం రూ.11,155.53 కోట్ల నుంచి రూ.11,443.46 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 13.77 శాతం నుంచి 9.98 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ కూడా 3.35 శాతం నుంచి 2.34 శాతానికి దిగొచ్చింది.