న్యూఢిల్లీ: వచ్చే ఆదివారం ఆన్లైన్ లావాదేవీల (నెఫ్ట్) సేవల్లో అంతరాయం ఏర్పడనుంది. వచ్చే ఆదివారం 14 గంటల పాటు ఈ సేవలు పనిచేయవని ఆర్బీఐ ట్విటర్ వేదికగా వెల్లడించింది. సాంకేతిక కారణాలతో ఈ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది.
“నెఫ్ట్ పనితీరును మరింత మెరుగుపర్చడం కోసం మే 22న వ్యాపార వేళలు ముగిసిన తర్వాత ఈ సాఫ్ట్వేర్లో సాంకేతిక అప్డేషన్ చేపడుతున్నాం. అందువల్ల మే 23వ తేదీన 00.01 గంటల నుంచి(అంటే మే 22 అర్ధరాత్రి 12 గంటల నుంచి) మధ్యాహ్నం 2 గంటల వరకు నెఫ్ట్ సేవలు అందుబాటులో ఉండవు.
ఆర్టీజీఎస్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి” అని ఆర్బీఐ తెలిపింది. దీనిపై ఆయా బ్యాంకులు తమ కస్టమర్లకు సమాచారం అందజేస్తాయని పేర్కొంది.