Neeraj Chopra | ఒలింపిక్స్ చరిత్రలో ఇండియా ఇవాళ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. నీరజ్ చోప్రా .. అథ్లెటిక్స్లోని ట్రాక్ అండ్ ఫీల్డ్ ( Track And Field ) ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా సూపర్ షో కనబరిచి స్వర్ణ పతకాన్ని గెలిచాడు. జావెలిన్ను అత్యధికంగా 87.58 మీటర్ల దూరం విసిరి టాప్లో నిలిచాడు. అథ్లెటిక్స్లో నీరజ్ బంగారు పతకాన్ని అందించి ఇండియాకు చిరస్మరణీయ రోజును మిగిల్చాడు.