బెంగళూరు: కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. నగరాలు, జిల్లా కేంద్రాలే కాకుండా రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు కూడా కరోనా ప్రబలుతున్నది. బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా అమనహళ్లి గ్రామంలో కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. అమనహళ్లిలో 300 మంది జనాభా ఉండగా, ఇటీవల ఆ గ్రామంలో అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షల్లో మొత్తం 144 మందికి పాజిటివ్ వచ్చింది. దాంతో గ్రామంలో దాదాపు సగం మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లయ్యింది. ఓ గ్రామంలో సగం మందికి పాజిటివ్గా తేలడంతో బెళగావి జిల్లా యంత్రాంగం ఖంగుతిన్నది. బాధితులందరినీ అందుబాటులో ఉన్న ఆస్పత్రులకు తరలించారు. గ్రామాన్ని పూర్తిగా సీల్డౌన్ చేశారు.
కాగా, అమనహళ్లి గ్రా మంలోని ప్రతి కుటుంబానికి చెందినవారు కూలీ పనుల కోసం గోవా, మహారాష్ట్రలకు వెళ్తుంటారు. రెండు రాష్ట్రాల్లోనూ కొవిడ్ తీవ్రం కావడంతో ఈ నెల 10న దాదాపు అందరూ గ్రామానికి వాపస్ వచ్చారు. తొలుత ముగ్గురు పరీక్షించుకోగా వారికి కొవిడ్ రావడంతో ఆ తర్వాత లక్షణాలు తీవ్రం కావడంతో అందరూ పరీక్షలు చేయించుకున్నారు. దాంతో సగం మందికి పాజిటివ్గా తేలింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
తెలంగాణలో కొత్తగా 6,206 కరోనా కేసులు
తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు
ఆడబిడ్డ పుట్టిందని అంతులేని సంబురం.. హెలిక్యాప్టర్లో ఘన స్వాగతం..!
ఆక్సిజన్ కొరత.. 24 గంటల్లో 25 మంది రోగులు మృతి