ఔరంగాబాద్, జూలై 9: దేశంలోని అన్ని కోర్టుల్లో దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోకపోతే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించారు. ఔరంగాబాద్లోని మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. న్యాయ నిపుణులను నియమించుకోవడం సాధారణ ప్రజలకు చాలా కష్టసాధ్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.