ముంబై: జనాభాను నియంత్రించడానికి ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొత్త జనాభా విధానాన్ని ప్రకటించిన రోజే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ కూడా దీనికి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఉండాలంటే, ఆరోగ్య జీవన ప్రమాణాలు పాటించాలంటే, సమతుల పర్యావరణం కావాలంటే జనాభా నియంత్రణ తప్పనిసరి అని పవార్ స్పష్టం చేశారు.
వీటి కోసం జనాభా నియంత్రణ అనే సందేశం దేశంలోని ప్రతి మూలకూ చేరాలని ఆయన అన్నారు. ఆ దిశగా ప్రతి పౌరుడూ నిబద్ధతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న జనాభా అభివృద్ధికి ఆటంకం అంటూ యూపీలో జనాభా నియంత్రణ కోసం నడుం బిగించింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. ఇద్దరే ముద్దు, ఆ ఇద్దరి మధ్య కూడా ఎడం ఎక్కువగా ఉండాలని యోగి సూచించారు.