న్యూఢిల్లీ: హోటల్ మేనేజ్మెంట్ జేఈఈ ప్రవేశ పరీక్ష రిజిస్ట్రేషన్ గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. కరోనా నేపథ్యంలో ఎన్సీహెచ్ఎం జేఈఈ 2021 దరఖాస్తు గడువును జూన్ 20 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం చివరి తేదీ రేపటితో ముగియనుంది. ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (ఐహెచ్ఎం) కాలేజీల్లో బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సుల్లో అడ్మిషన్స్ కల్పిస్తారు.
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 20
వెబ్సైట్: nchmjee.nta.nic.in