మణికట్టు మాంత్రికుడు వీవీఎస్ లక్ష్మణ్కు ఎన్సీఏ బాధ్యతలు అప్పగించాలని బోర్డు భావిస్తున్నది. ఈ అంశంపై బీసీసీఐ పెద్దలు గతంలోనే లక్ష్మణ్ను సంప్రదించగా.. అతడు సున్నితంగా తిరస్కరించాడు. అయితే ద్రవిడ్ చీఫ్ కోచ్ కావడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో బోర్డు మరోసారి లక్ష్మణ్ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నది. చర్చలు సఫలమైతే.. యువ ఆటగాళ్లకు తర్ఫీదునివ్వడంతో పాటు అంతర్జాతీయ ప్లేయర్లను మరింత సానబెట్టే పని లక్ష్మణ్ చూసుకోనున్నాడు. బాధ్యతలు చేపట్టేందుకు లక్ష్మణ్ అంగీకరించకపోతే బోర్డు.. మాజీ కెప్టెన్ అనీల్ కుంబ్లేను సంప్రదించే అవకాశాలున్నాయి.