భువనేశ్వర్ : బార్గఢ్ జిల్లాలోని పదంపూర్ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్లో ఎదురు కాల్పులు జరిగాయి. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎన్ఓసీ) జవాన్లు, ఒడిశా పోలీసుల సంయుక్త బృందానికి.. నక్సలైట్లకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో సీనియర్ క్యాడర్కు చెందిన నక్సలైట్ మృతి చెందాడని ఒడిశా డీజీపీ అభయ్ శుక్రవారం తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఒక ఒకే ఏకే47 రైఫిల్, మూడు మ్యాగజైన్స్, తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్కౌంటర్కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.