ఢిల్లీ ,మే, 28: జలదిగ్బందంలో ఉన్న పరిఖి గ్రామం చుట్టుపక్కల ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టడానికి భారత నావికాదళం తన విపత్తు సహాయ బృందాన్ని ఒడిశాలోని బాలసోర్ జిల్లా సదర్ బ్లాక్లో నియమించింది. హెచ్ఏడీఆర్ నావికాదళం సదర్ బ్లాక్లోని పరిఖి గ్రామానికి చెందిన బహుళార్థసాధక తుఫాను షెల్టర్ వద్ద కమ్యూనిటీ కిచెన్ను ఏర్పాటు చేసి తగు కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నది.
ఇక్కడ తయారు చేసిన భోజనాన్ని పరిఖి గ్రామం బుధిగాడియా, నందాచక్, బౌల్బెని మత్స్య కాలనీలలోని 700 మందికి పైగా సిబ్బందికి పంపిణీ చేస్తున్నారు. కమ్యూనిటీ కిచెన్ పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సహాయక బృందం బాధిత ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించింది. ఈ బృందం విపత్తు సందర్భంలో సకాలంలో అందించిన సేవకు ఇక్కడి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మరో నావికా దళం విపత్తు సహాయ బృందం తలాసరి (ఒడిశా ఉత్తరాన ఉన్న మత్స్యకార గ్రామం) కోసం మే 28, 21న నియమించారు.
తలాసరి, భోగ్రై, చంద్రమణి, ఇంచుండి గ్రామాల బాధిత ప్రాంతాలలో అవసరమగు సహాయక సామగ్రిని పంపిణీ చేయడానికి బయలుదేరింది. బాలాసోర్ వద్ద కొన్ని రహదారులపై కూలిన చెట్లను కోసి రోడ్ క్లియరెన్స్ కార్యక్రమాల్ని కూడా ఈ బృందం నిర్వహించింది. స్థానిక భద్రక్ జిల్లా ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఇప్పటికే సహాయక సామగ్రితో కూడిన నాలుగు నావికాదళ నౌకలు ఇప్పటికే ధమ్రా ఎంకరేజ్కు చేరుకున్నాయి. ఒడిశా బాలసోర్ జిల్లాలో తుఫాను సహాయక ప్రయత్నాలను పెంచడానికి ఓడల నుంచి హెలికాప్టర్ల సేవలు కూడా ప్రారంభమయ్యాయి.