పక్కా హైదరాబాదీ అయిన సరోజినీనాయుడు ఆంగ్లంలో అగ్ర కవయిత్రి మాత్రమే కాదు.. అఖిలభారత కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మహానాయకురాలు. మహాత్మాగాంధీ ఎంతో అభిమానించిన నాయకురాలు. సరోజినీనాయుడుకు నైటింగేల్ ఆఫ్ ఇండియా (భారత కోకిల) అని బిరుదు ఉంది. ఆమె గాంధీజీతో సహా ఎవరి గురించైనా నిర్మొహమాటంగా మాట్లాడేవారు. ఒకసారి ఓ విదేశీయుడు గాంధీజీని చూసి ‘ఈయన చాలా నిరాడంబరంగా ఉన్నాడే’ అని ఆశ్చర్యపోయాడట. దానికామె ఈయనను ఇంత నిరాడంబరంగా ఉంచేందుకు మేం ఎంత ఖర్చు చేస్తున్నామో మీకేం తెలుసు అన్నారట. గాంధీజీ చిరుకోపం ప్రదర్శిస్తూ ‘యూ నాటీగార్ల్ ఆఫ్ ఇండియా’ (భారతదేశపు అల్లరిపిల్ల) అని ముద్దుగా తిట్టారట. దటీజ్ సరోజినీనాయుడు.