హిమాయత్నగర్, నవంబర్20: సమాజంలోని కవులు, రచయితలు దేశ సంస్కృతి, ఐక్యతను పెంపొందించే రచనలు చేసి జాతీయవాదాన్ని భావితరాలకు అందించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. అజాదీకా అమృతోత్సవాలలో భాగంగా జాతీయ సాహిత్య పరిషత్, ఇతిహాస సంకలన సమితి, సంస్కార భారతి, ప్రజ్ఞాభారతి సంస్థల సంయుక్తంగా శనివారం నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఆడిటోరియంలో గోల్కొండ సాహితీ మహోత్సవాలు, ఫొటో ఎగ్జిబిషన్ ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో కొమురంభీం, రాంజీ గోండు, అల్లూరి వంటి గిరిజన వీరుల గాథలను పరిచయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని తెలిపారు. హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బ్రిటీష్ వారు మన సంపదను ఎంత దోచినా మన సంస్కృతిని దేశభక్తి కవులు కాపాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఐబీ, ఆర్వోబీ డైరెక్టర్ శృతిపటేల్, పీఐబీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్, ఆర్వోబీ అసిస్టెంట్ డైరెక్టర్ హరిబాబు, ఈఏ శ్రీనివాస్, ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య కసిరెడ్డి వెంకట్రెడ్డి, ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యదర్శి వడ్ల భాగయ్య, తెలంగాణ ప్రాంత సంఘచాలకుడు బూర్ల దక్షిణమూర్తి, సమాచార భారతి అధ్యక్షుడు ఆచార్య గోపాల్రెడ్డి, ఉపాధ్యక్షుడు జి.మల్లీశ్వర్, రచయితలు రతన్శార్దా, కేశవనాథ్, శైలజ, సారంగపాణి, సాహితీవేత్త కోవెల సుప్రసన్నచార్య తదితరులు పాల్గొన్నారు.