హిస్సార్: జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ (52 కేజీలు) ఫైనల్కు దూసుకెళ్లింది. వరుస విజయాలతో జోరుమీదున్న నిఖత్.. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో 5-0తో రాశి శర్మ (ఉత్తరప్రదేశ్)ను చిత్తు చేసింది. బుధవారం జరుగనున్న టైటిల్ పోరులో మీనాక్షి (హర్యానా)తో నిఖత్ అమీతుమీ తేల్చుకోనుంది. తెలంగాణకు చెందిన మరో బాక్సర్ గోనెల్ల నిహారిక 63 కేజీల సెమీఫైనల్లో పరాజయం పాలై.. కాంస్య పతకం సొంతం చేసుకుంది. హోరాహోరీ పోరులో నిహారిక 1-4తో జ్యోతి (రైల్వేస్) చేతిలో ఓడింది. 60 కేజీల సెమీస్లో హర్యానాకు చెందిన జైస్మీన్ 3-2తో స్టార్ బాక్సర్ సిమ్రన్జిత్ కౌర్ను చిత్తు చేసి సంచలనం సృష్టించగా.. పూజా రాణి (75 కేజీలు), మంజు రాణి (48 కేజీలు), కోమల్ (50 కేజీలు), అరుంధతి చౌదరి (70 కేజీలు) ఫైనల్లో అడుగు పెట్టారు.