హైదరాబాద్ : ఈ నెల 11న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యూ ఢిల్లీ అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైదరాబాద్, మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీలు తెలిపాయి. చెక్ బౌన్స్, ఎక్సైజ్ కేసులు, కార్మిక వివాదాలు, వైవాహిక కేసులు పెండింగ్లో ఉంటే లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించాయి.
మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టుల కాంప్లెక్స్, నాంపల్లి, సికింద్రాబాద్, మనోరంజన్ కాంప్లెక్స్ (ఎగ్జిబిషన్ గ్రౌండ్స్) లో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ కేసులను జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవలసిందిగా కోరారు.