హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : దేశంలో లౌకికవాదం, జాతీయ సమగ్రత అత్యంత ప్రమాదంలో ఉన్నదని, ఈ పరిస్థితుల్లో ప్రజల మధ్య మతసామరస్యం, శాంతి పెంపొందించాలని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం (ఐపీసో) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుధాకర్, తెలంగాణ కార్యదర్శి కేవీఎల్, రాష్ట్ర నాయకులు బుధవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని సత్కరించారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సీఎం కేసీఆర్ను కోరారు. వేతన సవరణ చేపట్టాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన లేఖ రాశారు.