జాతీయ క్రీడల్లో కొత్త ట్యాలెంట్ బయటపడుతుందని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ తిర్కే అన్నారు. అక్టోబరు 2 నుంచి 36వ నేషనల్ గేమ్స్ ప్రారంభం అవుతాయి. ఈ టోర్నీలో కొత్త కొత్త ప్లేయర్లు జాతీయ స్తాయిలో గుర్తింపు పొందుతారని దిలీప్ చెప్పారు. భారత హాకీ పునరుద్ధరణ దశలో ఉందని, చాలా మంది యువకులు ఈ క్రీడకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన తెలిపారు.
ఇలాంటి సమయంలో వీరికి అవసరమైన ఫైనల్ పుష్ ఈ జాతీయ క్రీడల్లో లభిస్తుందని అభిప్రాయపడ్డారు. పురుషుల, మహిళల రెండు విభాగాల్లోనూ టాప్-8 జట్లు మాత్రమే తలపడే ఈ క్రీడల్లో హాకీ అత్యుత్తమంగా ఉంటుందని చెప్పిన దిలీప్.. యువ ఆటగాళ్లు తమ సత్తా చాటడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంటుందన్నారు. అలాగే సెలెక్టర్లు కూడా ఈ మ్యాచులు చూస్తుంటారని హింట్ ఇచ్చారు.