నారాయణపేట టౌన్, అక్టోబర్ 28 : ప్రభుత్వం వివిధ శాఖల నుంచి అందజేస్తున్న సబ్సిడీ రుణాలను సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ హరిచందన అన్నారు. గురువా రం పట్టణంలోని అంజనా గార్డెన్ ఫంక్షన్ హాల్లో లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన రుణమేళాను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ద్వారా అందజేస్తున్న సబ్సిడీ రుణాలపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది లబ్ధి పొందలేకపోతున్నారని చెప్పారు. రుణమేళాలో ప్రభుత్వం అం దించే రుణాలు, అర్హతలు తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న మహిళా సం ఘాలు అన్నీ ఒకే రకం వ్యాపారాల కోసం రుణం తీసుకోవడం వల్ల ఏ ఒక్క సంఘం అభివృద్ధి చెందదన్నారు. ఒక్కొక్కరు వారిలో ఉన్న నైపుణ్యాలను బట్టి ఒక్కో రకమైన ఆలోచనతో రుణాలకు ప్రతిపాదనలు పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్బీఐ డీజీఎం నటరాజన్, జీఎం డీఐసీ రాంసుబ్బారెడ్డి, ఎల్డీఎం ప్రసన్నకుమార్, ఎస్బీఐ ఏజీఎం శ్రావణ్కుమార్రెడ్డి, డీడీసీబీ డీజీఎం కృష్ణప్రసాద్, డీఆర్డీవో గోపాల్నాయక్, జిల్లా అధికారులు రషీద్, కన్యాకుమారి పాల్గొన్నారు.
జీవనోపాధులు మెరుగుపర్చుకోవాలి
మహిళలు జీవనోపాధులు మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ హరిచందన సూచించారు. జిల్లా మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. నాయకత్వ మార్పిడి, మండల సమాఖ్యల పనితీరు, వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం అరుణ్య హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్ వారు త యారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వస్తువులను తిలకించారు. ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలానికి చింతపండు ప్రాసెసింగ్ యూనిట్ను మంజూరు చేస్తున్నట్లు తెలిపా రు. అలాగే దామరగిద్ద, మక్తల్ మండలాలకు దాల్మిల్ యూ నిట్, మద్దూర్ మండలంలో ఆయిల్మిల్, దాల్మిల్ యూ నిట్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. సమావేశంలో డీ పీఎంలు, ఏపీఎంలు, వివిధ మండల మహిళా సమాఖ్యల అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.