యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి బాల ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కనులవిందుగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మురళీకృష్ణుడి అలంకారంలో సేవపై వజ్రవైడూర్యాలు, వివిధ రకాల పుష్పాలతో నయనమనోహరంగా అలంకరించారు.
వేదమంత్రాలు, వేదపారాయణలు మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా బాలాలయంలో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలలయం ముఖ మండపంలో ఆస్థానం చేసి ఆలయ ప్రధానార్చకులు మురళి కృష్ణుడి అలంకార విశిష్టతను వివరించారు.