అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. నరసాపురాన్ని పశ్చిమగోదావరి జిల్లా కేంద్రంగా చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతుంది. పార్లమెంట్ నియోజకవర్గంగా ఉన్న నరసాపురాన్ని కాదని.. భీమవరాన్ని జిల్లా కేంద్రం ఎలా చేస్తారంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చింది . బంద్ కారణంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేసి బంద్కు మద్దతు ప్రకటించారు. బస్టాండ్ ఎదురుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిలపక్ష నాయకులు నినాదాలు చేశారు. నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాన్ని కాదని రాయకోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయడంపై రాజంపేటలో అ న్నిరాజకీయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శుక్రవారం కడప రాయచోటి రహదారిపై రాస్తారోకో నిర్వహించిన విద్యార్థి, యువజన సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.