నిర్మల్ : జిల్లాలోని ప్రసిద్ధ బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రంలో ఆంధ్రప్రదేశ్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మనుమడు, నారా లోకేష్, బ్రాహ్మణిల కుమారుడు దేవాన్షుకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేశారు. సినీ హీరో బాలకృష్ణ సతీమణి వసుంధర వారి కుమారుడు మోక్షజ్ఞ ఇతర బంధువులతో కలిసి అమ్మవారి ఆలయానికి వచ్చి దైవ దర్శనం చేసుకున్నారు. వీరికి అర్చకులు ఘన స్వాగతం పలికారు. అలాగే బాలకృష్ణ రెండో అల్లుడు భరత్, అతని భార్య తేజస్విని, వారి కుమారుడు ఆర్యన్కు అక్షరాభ్యాసం చేయించారు.