Nandamuri Balakrishna | నందమూరి బాలకృష్ణకు కోపం ఎంతుంటుందో.. ప్రేమ అంతకంటే ఎక్కువే ఉంటుంది. ఇప్పటికే అది చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. తాజాగా బాలయ్య చేసిన పనికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. బాలకృష్ణ ఇంత సింపుల్గా ఉంటాడా? అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకి బాలయ్య చేసిన పనేమిటి అని ఆలోచిస్తున్నారా?. అదేంటంటే తాజాగా బాలయ్య ఓ అభిమాని కుటుంబంతో కలిసి భోజనం చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
బాలయ్య గతంలో ఓ అభిమానికి కలుస్తా అని మాటిచ్చారు. అది గుర్తుపెట్టుకుని ఇప్పుడు అభిమానికి స్వయంగా ఫోన్ చేసి పిలిచి వారి కుటుంబంతో కలిసి కలిసి భోజనం చేశాడు. అంతేకాకుండా వారితో ఆప్యాయంగా మాట్లాడాడు. దాంతో బాలయ్య అభిమానులు ‘కొట్టినా, పెట్టినా మా బాలయ్య బాబే’ అంటూ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్నూల్లో జరుగుతుంది.
‘అఖండ’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత ఈ సినిమా తెరకెక్కనుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఇటీవలే విడులైన బాలయ్య పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ స్వర కర్తగా పనిచేస్తున్నాడు.
#NBKfan's about #Balakrishna Garu pic.twitter.com/abLKGAkAEg
— Nagendra (@mavillanagendra) July 25, 2022