తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ జనరల్ సెక్రటరీ మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్ మాట్లాడుతూ.. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని, తెలంగాణ నూతన సచివాలయానికి బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం యావత్ జాతికి గర్వకారణమన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
‘సమాజంలోని ప్రతీ ఒక్కర్నీ సమాన దృష్టితో చూసిన, దళిత, వెనుకబడిన వర్గాల సమానత్వం కోసం పోరాడిన మహనీయుడి పేరును అత్యాధునిక సచివాలయానికి పెట్టడం గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈ చర్యతో దళిత, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం మరింత పెరిగింది. ఇదే స్పూర్తితో కేంద్ర ప్రభుత్వం కూడా నూతన పార్లమెంటు భవనానికి బాబా సాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని డిమాండ్ చేస్తున్నాము’ అని చెప్పారు.