హైదరాబాద్ సిటీబ్యూరో/ఖైరతాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): నెగెటివ్ వార్తల కంటే.. పాజిటివ్ వార్తలనే ప్రజలకు చేరవేయడం ద్వారా సమాజంలో చైతన్యం పెంపొందించగలుగుతామని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా శనివారం సాయంత్రం టూరిజం ప్లాజాలో నిర్వహించిన దసరా షాపింగ్ బొనాంజా బం పర్ డ్రా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బంపర్ డ్రాలో ఆయన లక్కీ కూపన్ తీయగా, విజేత పేరును నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ డ్రాలో మైలార్దేవ్పల్లికి చెందిన వర్షిత మొదటి బహుమతిగా కారును గెలుచుకున్నా రు.
ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ప్రజలను చైతన్యం చేయడంలో నమస్తే తెలంగాణ పత్రిక మందువరుసలో ఉన్నదని చెప్పారు. నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ‘బ్రహ్మ ఎక్కడున్నాడంటే.. ఆనందంలో అని, ఆనం దం ఎక్కడ ఉన్నదంటే.. ఇవ్వడంలో ఉన్నదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని.. వినియోగదారుల కోసం నమస్తే తెలంగాణ-తెలంగాణ టు డే ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ఒక పేదింటి అమ్మాయి బంపర్ డ్రా విజేతగా నిలవడం ఎంతో సంతోషమని అన్నారు. డ్రావేదికపై నుంచే ఆయన కావటి వర్షిత తండ్రికి ఫోన్చేసి బంపర్ డ్రాలో మీరు రూ.8లక్షల విలువైన నిస్సాన్ మాగ్నెట్ కారు గెలుచుకున్నారని తెలిపారు.
బాలిక తండ్రి విజయ్కుమార్ సంతోషంతో ఉప్పొంగిపోయారు. తన కూతురు ఎంతో అదృష్టవంతురాలని ఆనందం వ్యక్తం చేశారు. కొవిడ్ తర్వా త షాపింగ్లో స్తబ్ధత నెలకొన్న తరుణంలో ఇలాంటి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఫ్రీడమ్ ఆయిల్ వైస్ప్రెసిడెంట్ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు కొనుగోలుదారులకు ఎంతో ఉపకరిస్తాయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ జోనల్ హెడ్ మహ్మద్ మక్సూద్ అలీ పేర్కొన్నారు. కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్స్గా ఫ్రీడమ్ ఆయిల్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ వ్యవహరించాయి. మెయిన్ స్పాన్సర్స్గా బిగ్ సీ, సీఎంఆర్ ఫ్యా మిలీ షాపింగ్మాల్, నీలోఫర్ కేఫ్ వ్యవహరించాయి. కార్యక్రమంలో తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్రెడ్డి, నమస్తే తెలంగాణ చీఫ్ ఆఫ్ న్యూస్బ్యూరో ఓరుగంటి సతీశ్, నీలోఫర్ కేఫ్ అధినేత బాబూరావు, నమస్తే తెలంగాణ సీజీ ఎం (ఆపరేషన్స్) శ్రీనివాస్, అడ్వైర్టెజ్మెంట్ జీఎం సురేందర్రావు, డీజీఎంలు, ప్రవీణ్, విజయ్కులకర్ణి, డీజీఎం (సర్యులేషన్) రాం రెడ్డి, ఏజీఎంలు రాజిరెడ్డి, రామకృష్ణ, రాములు తదితరులు పాల్గొన్నారు.
నిరుపేద కుటుంబంలో ‘నమస్తే’ వెలుగులు
రంగారెడ్డి రాజేంద్రనగర్ మండలం మైలార్దేవ్పల్లి లక్ష్మిగూడ రోడ్ దుర్గానగర్కు చెం దిన కావటి విజయ్కుమార్, కవిత దంపతుల కుమార్తె వర్షిత నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దసరా షాపింగ్ బొనాంజా బంపర్ డ్రాలో మొదటి బహుమతిని గెలుచుకున్నారు. తండ్రి హౌజ్ కీపింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుండగా, తల్లి పాత బట్టలకు స్టీలు సామాన్లు ఇస్తూ భర్తకు చేదోడుగా నిలుస్తున్నారు. లక్కీ డ్రాలో తనకు కారు బహుమతిగా రావడం నమ్మశక్యంగా లేదని విజయ్కుమార్ ఆనందం వ్యక్తంచేశారు. లక్షలాది రూపాయల విలువ చేసే కారు వస్తుందని ఊహించలేదన్నారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.