న్యూఢిల్లీ: దేశంలో ఖనిజాన్వేషణ మరింత పెరగాలని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఇవాళ లోక్సభలో ఆయన మాట్లాడారు. మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ బిల్లుపై మాట్లాడుతూ.. జిల్లా ఖనిజాభివృద్ధి నిధులను వాడేందుకు రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలన్నారు. నిధుల ఆధిపత్యం మొత్తం కేంద్రం చేతుల్లో ఉందని, స్థానిక రాష్ట్రాలకు కూడా అధికారాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఖనిజాల తొవ్వకాల కోసం తెలంగాణ ప్రభుత్వం తక్షణమే అనుమతులు ఇస్తోందన్నారు. తెలంగాణలో ఐరన్, మ్యాంగనీస్, లైమ్ స్టోన్ తొవ్వకాల కోసం అనుమతులు పెండింగ్లో ఉన్నాయని, ఆ పనులు చేపట్టేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఎంపీ నామా కోరారు. దక్షిణాది రాష్ట్రాల్లో గ్రానైట్ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నదని, వాళ్ల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లాంటి అనుమతులు త్వరగా వచ్చే విధంగా చూడాలన్నారు. మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ కమిటీలో ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా చేర్చాలని ఆయన కేంద్రాన్ని కోరారు.