CSIR | కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) డైరెక్టర్ జనరల్గా సీనియర్ శాస్త్రవేత్త నల్లతంబి కలైసెల్వి నియామకమయ్యారు. సీఎస్ఆర్ఐ డీజీగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఇంతకు ముందు డీజీగా పని చేసిన శేఖర్ మండే గత ఏప్రిల్లో పదవీ విరమణ చేయగా.. బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ కార్యదర్శి రాజేశ్ గోఖలే సీఎస్ఐఆర్ అదనపు బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. తాజాగా నల్లతంబి కలైసెల్విని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎస్ఐఆర్ మన దేశంలోని 38 పరిశోధన సంస్థల కన్సార్టియం. ఆమె రెండు సంవత్సరాల పాటు సేవలందించనున్నారు. లేదంటే బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు.. రెండింట్లో ఏది ముందుగా పూర్తయైతే అది వర్తిస్తుందని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం ఆమె తమిళనాడులోని కరైకుడిలోని సీఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా ఉన్నారు. 2019లో ఆమె ఈ బాధ్యతలు స్వీకరించారు.
ఆమె ఇదే ఇన్స్టిట్యూట్లో ఎంట్రీ లెవల్ సైంటిస్ట్గా తన వృత్తిని ప్రారంభించారు. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని అంబసముద్రంలో జన్మనించగా.. తమిళ మాధ్యమ పాఠశాలలో చదువుకున్నారు. తాను తమిళంలో చదవడం వల్ల కళాశాలలో సైన్స్ భావనలను అర్థం చేసుకోగలిగానని చెబుతూ ఉంటారు. ఆమె 125 పరిశోధన పత్రాలను సమర్పించి, ఆరు పేటెంట్లను పొందారు. లిథియం – అయాన్ బ్యాటరీ రంగంలో విశేష కృషి చేసి, గుర్తింపు పొందారు.