రామగిరి: విద్యార్థులకు పరిశోధనలపై ఆసక్తి పెంచాలనే సంకల్పంతోనే యూనివర్సిటీల్లో సెమినార్లు, రీసెర్చ్ ప్రాజెక్టులను నిర్వహించాలని ఎంజీయూ వీసీ ప్రొ. సీహెచ్.గోపాల్రెడ్డి వెల్లడించారు. నాగపూర్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రతినిధులు సోమవా రం ఎంజీయూను సందర్శించారు. దీనిలో భాగంగా ఆర్ట్స్ కళాశాల సమావేశ మందిరంలో ఆ ప్రతినిధులు, వర్సిటీ కళాశా లల ప్రిన్సిపాల్స్, డైరెక్టర్స్తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల అభ్యున్నతికి పరిశోధనలు బాగా తోడ్పడుతాయన్నారు.
పరిశోధనలు చేస్తే పరిజ్ఞానంతో పాటుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అనుసంధానించుకోని ప్రపంచ స్థాయి పరిశోధనలు నిర్వహించవచ్చన్నారు. దీనివల్ల విద్యార్థులు వ్యక్తిగతంగా లాభ పడటమే కాకుండా యూనివర్సిటీ పేరుప్రతిష్టలు పెరుగు తాయని ఆ దిశగా ఫ్యాకల్టీ పనిచేయాలన్నారు. ఇందుకు రీసెర్చ్ ఫౌండేషన్ ప్రతి నిధులతో అనుసందానంగా ఉండి ముందుకు సాగాలన్నారు.
నాగపూర్ రీసెర్చ్ ఫౌండే షన్ ప్రతినిధులు మీనా చంద్రావర్కార్, నేషనల్ ఆర్గనైజేషన్ కార్యదర్శి శంకర్ ఆనంద్ మాట్లా డుతూ సంస్థ ఇప్పటికే వంద యూనివర్సిటీలతో విద్యాభివృద్ధి అంశాలతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. గ్లోబల్ సైంటిఫిక్ టెక్నాలజీ అకడామిక్ రీసెర్చ్ వంటి విషయాల్లో సహకరిస్తామని ఇది ఒక సైంటిఫిక్ కమ్యూనిటీ అనుసంధానం చేస్తుందన్నారు.
కార్యక్రమంలో రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు అజయ్రావ్ల్, డా. మాని, భువనేశ్వర్ దిగ్విజయ్సింగ్, ఎంజీయూ యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాల్స్ డా. అంజిరెడ్డి, సంధ్యారాణి, పాలకమండలి సభ్యులు డా. ఆకుల రవి, శ్రీదేవి, కన్వీనర్స్ డా. వై.ప్రశాంతి, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.