నీలగిరి:18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భుపాల్రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని బీట్ మార్కెట్లో మాస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అదనపు కలె క్టర్ రాహుల్శర్మతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్ను అంతం చేయ డం ఒక్క వ్యాక్సిన్తోనే సాధ్యమవుతుందన్నారు.
అందులో భాగంగానే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మాస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా వ్యాప్తంగా మాస్ వ్యాక్సినేషన్ ద్వారా నూరు శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆధికా రులను కోరారు. అదనపు కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి సబ్ సెంటర్ పరిధిలో గ్రామాల, గూడాల వారీగా ప్రత్యేక కమిటీ వేసి అందులో 18 ఏండ్లు నిండి టీకా వేసుకోని వారి జాబితాను గుర్తించనున్నట్లు తెలిపారు.
గ్రామ స్థాయి యూనిట్లో అశ, అంగన్వాడీ కార్యకర్త, గ్రామ పంచాయతీ కార్యదర్శి, సిబ్బందితో కమిటీ ఉంటుందన్నారు. పట్టణంలో ఆశ, ఎఎన్ఎం, అంగన్వాడీ, మెప్మా సిబ్బంది ఉంటారన్నారు. వీరు కాకుండా మరో నలుగురితో కూడిన కమి టీ బృందం ఇంటింటికీ తిరిగి డేటాను సేకరిస్తుందన్నారు. ప్రతి ఇంటిలో నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తయితే ప్రత్యేకంగా రుపోందించిన స్టిక్కర్ను ఇంటికి అతికిస్తారన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 4,93,763 మందికి టీకాలు వేశామన్నారు. అందులో 3,88,870 మందికి మొదటి డోసు, 1,04,893 మందికి రెండో డోసు టీకాలు వేసినట్లు వివరించా రు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, రవిశంకర్, కౌన్సిలర్ యామ కవిత, మార్కె ట్ కమిటీ చైర్మన్ బొర్రా సుధాకర్, డాక్టర్ నితిన్ గౌతమ్, పానగల్ అర్భన్ హెల్త్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.