చండూరు(గట్టుప్పల్) సెప్టెంబర్ 28 : మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతు ఖాయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్లోని మంత్రి నివాసంలో గట్టుప్పల్ మాజీ సర్పంచ్, బీజేపీ నాయకులు కర్నాటి అశోక్, తాటి భాస్కర్, కర్నాటి రామలింగం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ నాడు గట్టుప్పల్ మండల ఏర్పాటుకు అడ్డుతగిలి నేడు ప్రభుత్వం ప్రకటించడంతో తన రాజీనామాతోనే మండలం ఏర్పాటైందని రాజగోపాల్రెడ్డి చెప్పడం విడ్డురంగా ఉందన్నారు. నూతన మండలం అభివృద్ధికి అన్ని విధాలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ అన్నెపర్తి సంతోషశేఖర్, నాయకులు ఎండీ.వహిద్, బోడ శ్రీకాంత్, బీమనపల్లి ముత్యం పాల్గొన్నారు.
ఎన్నికేదైనా టీఆర్ఎస్దే గెలుపు : కూసుకుంట్ల
చౌటుప్పల్ : ఎన్నికేదైనా గెలుపు టీఆర్ఎస్దేనని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సంగరి కులానికి చెందిన 120మంది సభ్యులు బుధవారం ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కుండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ కుల సంఘాల బలోపేతానికి సీఎం కేసీఆర్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమమే పరమావధిగా ఆయన పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలను రాజగోపాల్రెడ్డి మోసం చేశాడని విమర్శించారు.
పార్టీలో చేరిన వారిలో సంగరి కులస్తులు అలిసెరి సత్తయ్య, స్వామి, బెదరకొండ మోహన్, మాస సుధాకర్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుండబోయిన వెంకటేశం, దేవాలయ కమిటీ అధ్యక్షుడు దేవరపల్లి గోవర్ధన్రెడ్డి, యూత్ అధ్యక్షుడు తొర్పునూరి నర్సింహగౌడ్, కౌన్సిలర్లు ఎండీ.బాబాషరీఫ్, తాడూరి శిరీషాపరమేశ్, అంతటి విజయలక్ష్మీబాలరాజుగౌడ్, కొయ్యడ శేఖర్గౌడ్, నరేంద్రసాగర్ పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం మండలంలో..
సంస్థాన్ నారాయణపురం : సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. టీడీపీ మాజీ మండలాధ్యక్షుడు కుందారపు యాదయ్య, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు పాలకుర్ల స్వామి, మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు ఫెరోజ్, పద్మశాలి సంఘం మండలాధ్యక్షుడు బోళ్ల విఠలయ్య, వివిధ పార్టీలకు చెందిన 50కుటంబాల కార్యకర్తలు చౌటుప్పల్ మార్కెట్ యార్డులో బుధవారం ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ జక్కడి జంగారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు గుత్తా ప్రేమ్చందర్రెడ్డి, మన్నె ఇంద్రసేనారెడ్డి, నాయకులు గడ్డం పెంటయ్య, గడ్డం నరేశ్, తిరుమలేశ్ పాల్గొన్నారు.
మర్రిగూడ మండలంలో..
మర్రిగూడ : మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నలుగురు సీనియర్ కార్యకర్తలు దుబ్బ యాదగిరి, ఎల్లేశ్, సాయిలు, అన్నెపాక యాదగిరి ఎంపీపీ మెండు మోహన్రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి సమక్షంలో బుధవారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్, సర్పంచ్ కుంభం నర్సమ్మామాధవరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఐతగోని వెంకటయ్యగౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు వల్లపు సైదులుయాదవ్, మాజీ సర్పంచులు అంజయ్య, వల్లపు పర్వతాలు, నాయకులు కొండలు, జంగయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.
నాంపల్లి మండలంలో..
నాంపల్లి : మండలంలోని తుంగపాడ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పాలకుర్ల నరేశ్, బట్టు నరేశ్, కొమ్ము కృష్ణయ్య ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్రెడ్డి, సర్పంచ్ దండిగ అలివేలు, మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని తుంగపాడ్ పంచాయతీలోని అశోక్నగర్ గ్రామానికి చెందిన 10మంది యువకులు బీజేపీ నుంచి తిరిగి మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీశైలంయాదవ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.