డిండి, జూలై 21 : దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని చేపట్టారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. డబ్బు ఐదేండ్ల స్వాతంత్య్ర భారతావనిలో తరతరాలుగా సామాజిక, ఆర్థిక వివక్షకు గురవుతున్న దళితుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకే దళితబంధు పథకం అని పేర్కొన్నారు. గురువారం మండలంలోని సింగరాజుపల్లిలో దళిత బంధు పథకం కింద 47 మందిలో 26 మందికి మంజూరైన కమర్షియల్ వాహనాలను, 21 మందికి వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు యూనిట్లను గురువారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో అణిచివేయబడిన దళితుల జీవితాల్లో నూతనత్వం నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరాం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగారెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ రాజినేని వెంకటేశ్వర్రావు, శిరందాసు కృష్ణయ్య, వైస్ ఎంపీపీ గోరటి పుల్లమ్మ, సర్పంచ్ పొనుగోటి రవీందర్రావు, ఎంపీటీసీ శేఖర్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు దామోదర్రావు, ఏడీఏ బీరప్ప, తాసీల్దార్ ప్రశాంత్, ఎంపీడీఓ డానియేల్, నాయకులు విష్ణువర్ధన్రెడ్డి, భగవంత్రావు, భాస్కర్రెడ్డి, వెంకట్రెడ్డి, గుర్రం రాములు, జంతుక రామకృష్ణ, కలీం, శ్రీనివాస్ పాల్గొన్నారు.