ఎమ్మెల్యే భాస్కర్రావు
నిడమనూరు, మార్చి 28 : పూటకో పత్రికా ప్రకటనతో నల్లగొండ జిల్లా రాజకీయాలను కోమటిరెడ్డి బ్రదర్స్ భ్రష్టు పట్టించారని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్తో కలిసి ఆయన మాట్లాడారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 2018 ఎన్నికల్లో జిల్లా ప్రజలు తరిమి కొడితే భువనగిరికి పారిపోయిన చరిత్రను వెంకట్రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. విమర్శలతో ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం కాంగ్రెస్ నేతల అవివేకమని, ఉప ఎన్నికలో జానారెడ్డికి భంగపాటు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ బొల్లం జయమ్మ, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, నాయకులు చిన్నవీరయ్య, రవియాదవ్, వెంకటేశ్వర్లు, దాసు, శివ పాల్గొన్నారు.