రామగిరి, అక్టోబర్ 21 : యూజీడీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు(టీఎస్ పీఈసెట్-2021)కు మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. టీఎస్ పీఈసెట్ ఎంజీయూ నాలుగేండ్లుగా విజయవంతంగా నిర్వహిస్తుడడంతో ఈ పర్యాయం కూడా ఉన్నత విద్యాశాక అధికారులు బాధ్యతలు అప్పగించారు. పూర్తి ఈవెంట్స్ ఎంజీయూలో జరగాల్సి ఉండగా కొవిడ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి ఒకే రోజులో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఈవెంట్స్కు రాష్ట్ర వ్యాప్తంగా 5,054 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. సెట్ చైర్మన్గా ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ సీహెచ్.గోపాల్రెడ్డి, కన్వీనర్గా ఎంజీయూ డిపార్టుమెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డీన్ ప్రొఫెసర్ వి.సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో ఈ పరీక్షలు ఉదయం 7గంటలకు ప్రారంభం కానున్నాయి.
ఎంజీయూలో క్రీడామైదానాలు ముమ్మరంగా ఏర్పాట్లు…
ఫిజికల్స్ ఈవెంట్స్ కోసం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో క్రీడామైదానాలు సిద్ధంగా చేశారు. అంతే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి బసచేయడానికి యూనివర్సిటీ హాస్టళ్లను ఎంజీయూ స్పోర్ట్స్బోర్డు కార్యదర్శి డాక్టర్ జి.ఉపేందర్రెడ్డి, ఎంజీ యూ పీడీలు డాక్టర్ వై. శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ ఆర్.మురళీ, వీసీ, కన్వీనర్ల ఆదేశాలతో ఏర్పాట్లు పూర్తి చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 5,054 మంది దరఖాస్తులు
టీఎస్పీఈసెట్-2021కి రాష్ట్ర వ్యాప్తంగా 5,054 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. కాగా గురువారం సాయంత్రం వరకు 4,459 మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా (వీరిలో యూడీ డీపీఈడీకి 1,849మంది, బీపీఈడీకి 2,612 (విద్యార్థులు) ఉన్నారు. ఇంకా 595 మంది విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉండగా పరీక్ష కేంద్రాల వారీగా విద్యార్థుల సంఖ్యలో మార్పులు జరుగనున్నట్లు తెలుస్తుంది. అభ్యర్థులు పరీక్షల స మయం కంటే గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, శానిటైజర్స్తో రావాల్సి ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు, హాజరయ్యే విద్యార్థులు ఇలా..
పరీక్ష కేంద్రం విద్యార్థులు