హైదరాబాద్ : హైదరాబాద్ నగరంపై దివంగత మాజీ మంత్రి నాయిని నరసింహా రెడ్డి చెరగని ముద్ర వేశారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అలాంటి మహానేత ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు నడిచేవని ఆయన గుర్తు చేశారు.
దివంగత మాజీ మంత్రి నాయిని నరసింహా రెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని లోయర్ ట్యాంక్బండ సమీపంలోనీ పింగళి వెంకటరామ్ రెడ్డి ఫంక్షన్ హాల్ లోజరిగిన కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయిని చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిత్యం బీద ప్రజల అభ్యున్నతి కోసం పరితపించిన మహానేత నాయిని నర్సింహారెడ్డి అని కొనియాడారు. కార్యక్రమంలో దేవరకొండ శాసన సభ్యుడు రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.