పాలమూరు బిడ్డగా పట్నానికి వలస.. హోటళ్లు, బట్టల దుకాణాల్లో పని చేస్తూ కడుపు నింపుకొన్నాడు.. పేదరికానికి నిలువుటద్దంలా నిలిచిన ఓ సామాన్యుడు తన కష్టం, చాతుర్యంతో ఇప్పుడు శ్రీమంతుడిగా మారారు. ఆయనే మర్రి జనార్దన్రెడ్డి. ప్రస్తుతం రాష్ట్రంలోని వస్త్ర వ్యాపారుల్లో ప్రముఖుడిగా నిలిచి పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి రాగా గుర్తించిన ప్రజలు అక్కున చేర్చుకొన్నారు. ఎమ్మెల్యేగా గెలిపించుకోగా తన మూలాలను మరవని మర్రి ఓ వైపు నాగర్కర్నూల్ నియోజకవర్గ అభివృద్ధిలో.. మరోవైపు ఎంజేఆర్ ట్రస్టును స్థాపించి సొంత డబ్బుతో ఆధ్యాత్మిక, సామాజిక సేవలోనూ శ్రీమంతుడిగానూ పేరు తెచ్చుకొంటున్నారు. వందలాది జంటలకు సామూహిక వివాహాలు, యువతకు ఉచిత ఉద్యోగ శిక్షణ అందిస్తూ అందరి ఆదరాభిమానాలు పొందుతున్నారు. తాజాగా యాదాద్రి క్షేత్రానికి రూ.2 కోట్లు, 2 కిలోల బంగారం విరాళంగా ప్రకటించి తన ఉదారత్వాన్ని చాటుకున్నారు.
నాగర్కర్నూల్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఎంత డబ్బున్నా, పదవులు వచ్చినా మూ లాలను మరిచిపోయే నేటి తరుణంలో అందుకు తాను మినహాయింపు అంటూ నాగర్కర్నూల్ ఎ మ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఉదారత చాటుతున్నారు. తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లి గ్రామంలో పేద కుటుంబంలో జన్మించిన మర్రి.. పదో తరగతి పాసయ్యాక పొట్టకూటి కోసం వలస వెళ్లారు. హైదరాబాద్లో హోటళ్లు, బట్టల షాపుల్లో పని చేశారు. ఈ క్రమంలో ఒక్కో మెట్టు ఎదుగుతూ, శ్రమిస్తూ ముం దుకెళ్లారు. ఇందుకు అదృష్టం కూడా తోడైంది. సినిమాల్లో హీరోల్లాగా అతి త్వరలోనే చిన్న బట్టల షా పు నుంచి ప్రారంభమైన వ్యాపారం.. ఇప్పుడు రా ష్ట్రంలోనే ప్రముఖ స్థానంలో నిలిచింది. జేసీ బ్రద ర్స్, చెన్నై షాపింగ్ మాల్ స్థాపించి శ్రీమంతుడిగా నిలిచారు. అయితే, తన చిన్ననాటి కష్టాలను, పేదరికాన్ని మరిచిపోలేని ఆయన.. తాను సంపాదించి న డబ్బులతో తృప్తి పడకుండా ప్రజలకు సేవ చేసేందుకుగానూ ఎంజేఆర్ ట్రస్టు స్థాపించారు. తన సేవలను మరింత విస్తరించేందుకు 2012 ఉప ఎన్నికలతో రాజకీయాల్లోకి వచ్చారు. మొదట ఓటమి చెం దినా.. ఆయన సేవలను గుర్తించిన ప్రజలు 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించారు. ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా వ్యక్తిగతంగా సామాజిక, ఆధ్యాత్మిక సేవ చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. జీయర్ స్వామి ఆధ్వర్యంలో వేలాది మందితో మ హాలక్ష్మీ యాగం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ని ర్వహించిన యాగంలోనూ ప్రత్యేక సేవల్లో భాగమయ్యారు. ఇటీవల యాదాద్రి దేవస్థానానికి 2 కిలోల బంగారం, కాటేజీల నిర్మాణానికి రూ.2 కోట్ల విరాళాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ట్రస్ట్ ఆ ధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాలు పాలమూరు చరిత్రలోనే ప్రత్యేకం. పేదరికంతో పెం డ్లిళ్లు చేసుకోలేని స్థితిలో ఉన్న జంటలకు ప్రతి ఏడా ది అంగరంగవైభవంగా వివాహాలు జరిపిస్తున్నారు. ఒక్కో జంటకు దాదాపుగా రూ.50 వేల విలువైన సామగ్రిని కూడా అందజేస్తున్నారు. దీంతో మర్రిని నియోజకవర్గంలోని ప్రజలంతా తమ ఇంటి బిడ్డగా భావిస్తున్నారు. నాలుగు పర్యాయాల్లో 500 జంటలు ఒక్కటయ్యాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ జంటలకు శాస్ర్తోక్తంగా పెండ్లిళ్లు జరిపించారు. నాటి గవర్నర్ నరహింహన్, మంత్రి హరీశ్రావుతోపాటు జిల్లా మంత్రులు, సినీ, టీవీ కళాకారుల సమక్షంలో నాలుగు రోజుల పాటు అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు. కరోనాతో నిలిచిపోయిన ఈ వేడుకలు వచ్చే ఏడాది నుంచి జరగనున్నాయి. అ లాగే పోలీస్, ఉపాధ్యాయ, గ్రూప్స్ ఉద్యోగాలకు హై దరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి శిక్షణ పొందలేని యువతకు నాగర్కర్నూల్లోనే ఉచితంగా శిక్షణ, వసతి, భోజన సదుపాయాలు, స్టడీ మెటీరియళ్లు అందించారు. దాదాపుగా 20 వేల మంది విద్యార్థు లు శిక్షణ పొందారు. ఇందులో చాలా మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 130 మంది దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు, ఇతర పరికరాలను పంపిణీ చేశారు. మూడు అంబులెన్స్లను ఉచితంగా సమకూర్చారు. తిమ్మాజిపేటలో జి ల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.2 కోట్లతో ఆధునికంగా భవనం నిర్మిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు, ఇతర ప్రత్యేక దినోత్సవాల్లో క్రీడా, సాంస్కృతిక పోటీలు, సన్మానాలు నిర్వహిస్తున్నారు. తన పుట్టిన రోజున రక్తదా న శిబిరాలు, మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ వం టివి ట్రస్ట్ పేరిట చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలో ని మినీ ట్యాంక్బండ్పై రూ.60 లక్షలతో సొంతం గా హైదరాబాద్ మాదిరి బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. కరోనా నేపథ్యంలో రెండు నెలలపా టు కషాయం అందించారు. ఐదు వేల మందికి కరోనా కిట్లు, 2 వేల మందికి నిత్యావసర సరుకులు అందించడం విశేషం. జిల్లా దవాఖానలోని కొవిడ్ కేంద్రంలో రోగులకు 2 నెలలపాటు పౌష్టికాహారం అందించారు. ఇక రూ.వందల కోట్ల నిధులతో ని యోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో ప్రత్యేక స్థానంలో నిలుపుతున్నారు. ఎం జీకేఎల్ఐ, పీఆర్ఎల్ఐ ప్రాజెక్టులతోపాటు మినీ ట్యాంక్బండ్, మెడికల్ కళాశాల, జిల్లా కేంద్రంలో రూ.80 కోట్లతో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు వంటి అ భివృద్ధి పనులు చేపట్టారు. ఇలా ప్రజాప్రతినిధిగానే కాకుండా సేవలోనూ తన మార్క్తో రాజకీయాలకు మర్రి సరికొత్త నిర్వచనం ఇస్తూ ప్రజాశీర్వాదాన్ని పొందుతున్నారు.
ప్రజాసేవతోనే సంతృప్తి..
డబ్బు ఎంత సంపాదించినా.. ప్రజలకు సేవ చేయడంలోనే ఆత్మ సంతృప్తి ఉంది. నా పేదరికం, చెల్లి పెండ్లి కోసం పడ్డ కష్టాన్ని ఎన్నటికీ మర్చిపోను. అందుకే ఎంజేఆర్ ట్రస్ట్ స్థాపించాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. సేవలను గుర్తించిన ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా, మెడికల్ కళాశాల, ఎంజీకేఎల్ఐ, పీఆర్ఎల్ఐ పథకాలు, మినీ ట్యాంక్బండ్వంటి ల్యాండ్మార్క్గా నిలిచే అభివృద్ధి చేపట్టినందుకు సంతోషంగా ఉంది. రాజకీయాలకు సంబంధం లేకుండా చనిపోయే వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా.